చిత్తూరులో యెమెన్ విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరులో యెమెన్ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరు నగర శివారులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఖలెద్ మహమద్ ఒత్మాన్ నయీఫ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యెమెన్ దేశానికి చెందిన ఇతడు 2014లో ఆ దేశ ప్రభుత్వం తరఫున ఉపకార వేతనంపెకిక్కడికి వచ్చాడు. అదే దేశానికి చెందిన హషీమ్ అల్-షబి అనే విద్యార్థితో కలసి స్థానికంగా గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడు. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కేరళకు తీసుకెళ్లి అక్కడ వైద్య సేవలను అందించాడు. అతడి గదిలో ఉంటున్న మిత్రుడు సైతం కొన్ని నెలల నుంచి ఆరోగ్య సమస్యలపై కేరళలో వైద్య సేవలను పొందుతున్నాడు. ఇటీవలే మిత్రుడు కేరళకు వెళ్లగా.. తన తల్లికి సైతం అక్కడి నుంచి మందులు తీసుకురావాలని కోరాడు. శనివారం కేరళకు వెళ్లిన మిత్రుడు.. నయీఫ్కు ఫోన్ చేశాడు. ఎంతసేపటికీ అతడు స్పందించకపోవడంతో మరో మిత్రుడికి ఫోన్చేసి గదిని పరిశీలించాలని కోరాడు. మిత్రులు వెళ్లి గదిని పరిశీలించగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్యలు.. లేక ఆర్థిక సమస్యలేదైనా ఉండొచ్చని తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు.
No comments:
Post a Comment