ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. ఎంఆర్ఐ మెషిన్లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్ మురు తల్లి నాయర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెను చూడటానికి శనివారం సాయంత్రం రాజేశ్ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సమయంలో వార్డ్బాయ్ ఆక్సిజన్ సిలిండర్ను ఎంఆర్ఐ గదికి తీసుకురమ్మని అతడ్ని కోరాడు. సిలిండర్తో రాజేశ్ వెళ్లిన వెంటనే స్కానింగ్ రూమ్లో ఎంఆర్ఐ మెషిన్కు ఉన్న అయస్కాంత శక్తి ఒక్కసారిగా అతడ్ని లాగింది. ఈ ప్రమాదంలో రాజేశ్ మెషిన్లో చిక్కుకుని, 2 నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు.
No comments:
Post a Comment