కాచిగూడ: పొగమంచు హైదరాబాద్ వాసులను ఉక్కిరిబిక్కిరిచేసింది. సోమవారం ఉదయం దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కనుచూపు మేర ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబర్పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. అంబర్పేటలోని ముసారాబాగ్ రహదారి వంతెనపై సోమవారం తెల్లవారు జామున కనిపించిన చిత్రాలివి.

No comments:
Post a Comment