Thursday, 7 June 2018

{
                  "success": true,
                  "message": null,
                  "result": [
                    {
                      "id": 512,
                      "timeStamp": "2016-04-28T01:34:02.397",
                      "quantity": 0.00784797,
                      "price": 0.01000000,
                      "orderType": "Buy",
                      "total": 0.00007848
                    },
                    {
                      "id": 503,
                      "timeStamp": "2016-04-23T08:16:38.087",
                      "quantity": 0.00134797,
                      "price": 0.08555000,
                      "orderType": "Buy",
                      "total": 0.00011532
                    },
                    {
                      "id": 502,
                      "timeStamp": "2016-04-23T08:16:34.91",
                      "quantity": 0.00650000,
                      "price": 0.07900000,
                      "orderType": "Buy",
                      "total": 0.00051350
                    }
                  ]
                }                

                

Wednesday, 4 April 2018

కనీసం పది కూడా చదవలేదు.. కానీ కోట్లు ఆర్జిస్తున్నారు.

కనీసం పది కూడా చదవలేదు.. కానీ కోట్లు ఆర్జిస్తున్నారు.

‘ప్రపంచం ఏమైనా కానీ... నా కడుపులో మాత్రం ఓ కప్పు టీ పడాల్సిందే’ అన్నాడో ప్రముఖుడు. ఆయనే కాదు... ఈ జగత్తులో ఎందరికో టీతోనే తెల్లారుతుంది. ఎల్లలు లేని ఈ అభిరుచే పుణేలోని ఓ కుటుంబానికి లక్షలు కురిపిస్తోంది. కేవలం టీ అమ్మి ఆ కుటుంబం నెలకు అక్షరాలా పన్నెండు లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. ఇంతకీ ఆ టీ సీక్రెటేంటనేగా..! చూద్దాం రండి...
 
పుణేలోని అప్పా బల్వంత్‌ చౌక్‌. ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటుంది. అలాగని అక్కడేదో మార్కెట్టో... షాపింగ్‌ మాలో లేదు. ఉన్నదల్లా టీ హౌస్‌... ‘యేవలే అమృతతుల్య’! ఒక్కసారి అక్కడ ఓ సిప్పు కొడితే... ఇక రోజూ దాని ముందు క్యూ కడతారు! అంతలా ఉంటుంది టేస్ట్‌. గ్యాలన్ల కొద్దీ టీ గంటల్లో ఆవిరవుతుంది. మరే ప్రాంతంలో దొరకని ఈ రుచికి పుణేవాసులు మైమరిచిపోతున్నారు. షాప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీలేష్‌ యేవలే మాటల్లో చెప్పాలంటే... ‘మాకు నగరంలో మొత్తం మూడు షాపులున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఈ టీ హౌస్‌లు తెరిచి ఉంటాయి. అన్నింటిలో కలిపి రోజుకు కనీసం ఐదు వేల కప్పుల టీ అమ్ముతాం. కప్పు రూ.10. నెలకు 1,000 కిలోల పంచదార, 400 కిలోల టీ పొడి ఖర్చవుతుంది’. ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు యేవలే కుటుంబం చేసే టీ టేస్ట్‌ కెపాసిటీ ఏంటో!
 
తండ్రి బాటలోనే తనయులు...
పురందర్‌ గ్రామానికి చెందిన నీలేశ్‌ తండ్రి దశరథ్‌ యేవలే తొలుత పాలు సరఫరా చేసేవారు. 1983లో పుణేలో ఆయన ఓ దుకాణం అద్దెకు తీసుకుని టీ స్టాల్‌ పెట్టారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ మార్కెట్‌లో ఉండాలని ఆయన కలలు కనేవారు. కానీ ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. దశరథ్‌కు ఐదుగురు కుమారులు. ఆయన మరణం తరువాత తనయులు తండ్రి కల నిజం చేయాలని పూనుకున్నారు. అయితే కుప్పలుతెప్పలుగా ఉన్న టీ స్టాల్స్‌తో పాటు తమదీ ఒక స్టాల్‌ పెడితే పెద్దగా ఫలితం ఉండదని భావించారు. నాలుగేళ్ల పాటు రకరకాల టీలు ప్రయత్నించి చివరకు అప్పా బల్వంత్‌ చౌక్‌లో తొలి టీ స్టాల్‌ ‘యేవలే అమృతతుల్య’ ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. డిమాండ్‌ పెరిగింది. దీంతో గత ఏడాది నగరంలో మరో బ్రాంచ్‌ ఏర్పాటు చేశారు. రెండు మూడు నెలల్లోనే ఆదరణ విపరీతంగా వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరో బ్రాంచీ పెట్టారు. ఇప్పుడు ‘యేవలే అమృతతుల్య’ టర్నోవర్‌ నెలకు రూ.12 లక్షలు!
 
టేస్ట్‌ సీక్రెట్‌...
‘యేవలే’ టీ కోసం జనం ఇంతగా ఎగబడటానికి కారణం... వారి ఫార్ములానే! పుణేలోని మూడు బ్రాంచీల్లో ఎక్కడ ఏ కప్పు తాగినా ఒకటే రుచి ఉంటుంది. ‘చాలా చోట్ల మరుగుతున్న నీటిలో ప్యాకెట్‌ పాలను నేరుగా పోస్తారు. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. కానీ మా తయారీ విధానం పూర్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలను రెండుసార్లు కాస్తాం. చల్లార్చిన తరువాతే టీ కలుపుతాం. అందువల్ల మా టీ తాగితే ఎసిడిటీ సమస్య రాదు. మా గ్రామం నుంచి స్వచ్ఛమైన, తాజా పాలు తీసుకొస్తాము. సల్ఫర్‌ లేని పంచదార, ఫిల్టర్‌ వాటర్‌ వాడతాం. సాధారణ పంచదారలో కెమికల్స్‌ ఉంటాయి. దానివల్ల టీ నల్లబడుతుంది’ అంటారు నీలేశ్‌. తమ దుకాణాల్లో ఆయన టైమర్లు అమర్చారు. ఏడు నిమిషాలవ్వగానే గ్యాస్‌ ఓవెన్‌ ఆగిపోతుంది. ఎక్కువ మరిగితే అసలైన రుచి పోతుందని ఇలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఒకటే ‘టీ’...
యేవలేలో అమ్మేది ఒకటే రకం ‘మిల్క్‌ టీ’. బ్లాక్‌ టీ, కడక్‌ చాయ్‌ అంటూ వేరే రకాలేమీ ఉండవక్కడ! కనీసం బిస్కెట్లు కూడా అమ్మరు. భవిష్యత్తులో మహారాష్ట్ర వ్యాప్తంగా 100 అవుట్‌లెట్స్‌ ప్రారంభించాలనేది వారి లక్ష్యం. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఫ్రాంచైజీల కోసం రెండొందలకు పైగా ప్రతిపాదనలు వచ్చాయంటే ఈ టీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే యేవలే అన్నదమ్ముల్లో ఎవరూ ఏ మేనేజ్‌మెంట్‌ కోర్సూ చేయలేదు. కనీసం పదో తరగతికి మించి చదవలేదు. కానీ... సంప్రదాయ చాయ్‌ని విభిన్నంగా నోటికందిస్తూ లక్షలు గడిస్తున్న వీరు ఎందరో వ్యాపారవేత్తలకు స్ఫూర్తి ప్రదాతలు.

Saturday, 24 February 2018

శ్రీదేవి ఇక లేరు (ఆమె కన్నుమూశారు)


శ్రీదేవి ఇక లేరు 

కాలం మారిపోతోంది. తరాలు మారుతున్నాయి. వాటితోపాటు కొంతమంది వ్యక్తులూ మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతుంటారు. కానీ, రోజులెన్ని మారినా ఏళ్లు ఎన్ని గడిచినా మనం మరిచిపోలేని మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. తన అందాలతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆమె ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని సంజయ్‌ కపూర్‌ ద్రువీకరించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.
బాల నటిగా..
తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1967లో బాలనటిగా ‘కన్దన్‌ కరుణాయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించారు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో అన్ని ఇబ్బందులు పడ్డారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం. ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతుండేవారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌ కపూర్‌ సోదరుడు బోనీకపూర్‌ను 1996జూన్‌ 2న వివాహం చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి ఇద్దరు పిల్లలు.


సెకండ్‌ ఇన్నింగ్స్‌
పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్‌ పాత్ర బాగా పాపులర్‌ అయింది. ఆ సీరియల్‌ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు. అయితే, నిర్మాతగా ‘పోకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్‌’గా నిర్మించారు. 2012లో వచ్చిన ‘ఇంగ్లీష్‌-వింగ్లీష్‌’ చిత్రం ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవలే ‘మామ్‌’ చిత్రంతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన ‘సైరాట్‌’ సినిమాను హిందీలో ‘దడాక్‌’ పేరుతో రిమేక్‌ చేస్తున్నారు. కరణ్‌ జోహర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
అవార్డులు
తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్‌ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌’గా శ్రీదేవి ఎంపికయ్యారు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం 
సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు 
ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న బౌన్స్‌ బ్యూటీ సెలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అర్బన్‌ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదులందాయి. దీంతో ఆ సెలూన్‌పై నిఘా పెట్టాలని క్యూఆర్టీ విభాగం ఎస్సై నాగుల్‌మీరాను ఎస్పీ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఎస్సై తమ సిబ్బంది మస్తాన్‌, ప్రవీణ్‌, నాగరాజు, నాగేశ్వరరావు, నాగయ్య, మహిళా కానిస్టేబుల్‌తో కలిసి లక్ష్మీపురానికి చేరుకున్నారు. సెలూన్‌ బయట కొంత మందిని ఉంచి.. ఎస్సై మరో కానిస్టేబుల్‌తో కలిసి సాధారణ వ్యక్తులవలేె లోపకి వెళ్లారు. వారు మీకేమి కావాలంటూ ఓ యువతి పలకరించడంతో వారికి అనుమానం రాకుండా క్రాప్‌ (క్షవరం), కాళ్ల గోర్ల్లు తీయించుకోవడానికి వచ్చామని చెప్పారు. అందుకుగాను రూ.700లు ఖర్చవుతుందని చెప్పడంతో వారు ఆ మొత్తాన్ని చెల్లించారు. క్రాప్‌ చేసే, గోర్లు తీసే సమయంలో అక్కడ జరుగుతున్న తంతుపై రహస్యంగా పర్యవేక్షించారు. ఇంతలో కొంతమంది యువకులు సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లోకి వెళ్లడాన్ని ఎస్‌ఐ పసిగట్టారు. దీంతో అక్కడ ఉన్నవారితో సెలూన్‌లో ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయంటూ మాటలు కలపడంతో పురుషులకు మహిళలతో మసాజ్‌ చేసే సదుపాయం మా ప్రత్యేకత అంటూ చెప్పారు. అలా మాటామాటా కలిపి అక్కడి రహస్య గదుల్లోకి వచ్చే..వెళ్లే వారి ప్రవర్తన తీరు, యువతులను ఆ గదుల్లోకి పంపిస్తున్న తీరును చూసి వ్యభిచారం జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు. రహస్య గదుల్లో వాడిపడేసిన నిరోధులు వారి కంటపడ్డాయి. దీంతో సెలూన్‌ లోపల ఉన్న ఎస్సై బయట ఉన్న కానిస్టేబుళ్లకు సంకేతాలు పంపించడంతో అందరూ కలిసి ఒక్కసారిగా సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,500ల నగదు, 11 చరవాణిలు (సెల్ ఫోన్ ) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విజయవాడకు చెందిన సంధ్య, శాంతకుమారి, కృష్ణా జిల్లాకు చెందిన సుకన్య, గుంటూరు నగరాలకు చెందిన లక్ష్మి, మారుతీనగర్‌కు చెందిన మస్తాన్‌బీ, అమరావతి రోడ్డుకు చెందిన ప్రేమ్‌చంద్‌, పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన వెంకట సత్యాలరావు, గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన వెంకట నరేష్‌లు ఉన్నట్లు సమాచారం. గుంటూరు నగరం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Friday, 23 February 2018

మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం


మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం :   ప్రభుత్వం 

దిల్లీ: మోసపూరిత పథకాలతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని, పరారయ్యే వ్యాపారులకు అడ్డుకట్ట పడనుంది. స్థిరాస్తి, బంగారు ఆభరణాల వ్యాపారులు ‘కచ్చితమైన ప్రతిఫలం’ అందిస్తామని ప్రకటిస్తే, వాటిని సామూహిక మదుపు పథకాలుగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
స్థిరాస్తి అభివృద్ధి సంస్థ కనుక, కొనుగోలుదార్లకు సదరు ఆస్తిని బదలాయించే వరకు ‘స్థిర ప్రతిఫలం అందిస్తామనే’ హామీపై నగదు వసూలు చేస్తే, వాటిని ‘అనియంత్రిత డిపాజిట్లు’గా పరిగణించనున్నారు. ఎక్కువమంది స్థిరాస్తి వ్యాపారులు 9-14 శాతం మొత్తం ప్రతిఫలం ఇస్తామని చెబుతూ, డిపాజిట్‌ రూపేణ నగదు జమ చేసుకుంటున్నారు. మరికొందరు అభివృద్ధిదారులు కూడా కనీసం 10 నెలల పాటు వాయిదాల్లో నగదు చెల్లించాలని కోరుతున్నారు. అనంతరం, డిపాజిట్ల కాలావధికి అనుగుణంగా, నెలవారీ మొత్తంపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ అనియంత్రిత డిపాజిట్ల కిందకే వస్తాయి. అధిక కేసుల్లో స్థిరాస్తి అభివృద్ధి దారులు ప్రారంభంలో కొన్ని నెలల వాయిదాలు చెల్లిస్తారు. అనంతరం వారు చెల్లింపులు ఆపేస్తారు. ఇలాంటివి చట్టం ద్వారా నియంత్రించాల్సి ఉంది. 
ఇదేవిధంగా ఆభరణాల విక్రేతలు కూడా ‘11 నెలల పాటు నెలసరి వాయిదాలు చెల్లించండి, 12న వాయిదాను మా సంస్థ జమచేస్తుంది. ఈ 12 నెలల మొత్తాన్ని వినియోగించుకుని, మా విక్రయశాలోనే ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు’ అని ప్రకటిస్తున్నాయి. 
ఈ రెండు రకాల డిపాజిట్లు ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధ బిల్‌-2018’ పరిధిలోకి రానున్నాయి. మార్చి 5న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. మోసపూరిత సామూహిక మదుపు పథకాలపై ఉక్కుపాదం మోపడమే ఈ బిల్లు లక్ష్యం. నియంత్రణ, అనియంత్రణ పద్ధతుల్లో డిపాజిట్లు వసూలు చేసేవారంతా, సంబంధిత అధీకృత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయకుండా పథకాల రూపేణ నగదు వసూలు చేస్తే, ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించింది.


5 మిలియన్‌ డాలర్లు బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........

5 మిలియన్‌ డాలర్లు  బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........  
ఒక సినిమా బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించడమంటే మాటలా..?. అదీ ఓ తొలి చిత్ర దర్శకుడు పెద్దగా పేరు లేని నటులతో అతి తక్కువ వ్యయంతో తెరకెక్కించిన సినిమా అంతటి విజయం అందుకుందంటే ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అంతటితో అయిపోలేదు... ఆస్కార్‌ బరిలోనూ నాలుగు ప్రధాన నామినేషన్లు అందుకుని సత్తా చాటింది. ఆస్కార్‌ చరిత్రలో ఓ హారర్‌ సినిమా ఉత్తమ చిత్రం పురస్కారం కోసం పోటీపడటం చాలా అరుదు. ఆ ఘనత అందుకున్న చిత్రమే ‘గెటవుట్‌’. ఆఫ్రికన్‌ అమెరికన్‌ దర్శకుడు జోర్డాన్‌ పీలె తెరకెక్కించిన ఈ చిత్రంలో డేనియల్‌ కలూయ, అలిసన్‌ విలియమ్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ విశేషాలివీ.
హాలీవుడ్‌లో 5 మిలియన్‌ డాలర్లు అంటే చాలా తక్కువ బడ్జెట్‌ కిందే లెక్క. అంతే వ్యయంతో కేవలం 23 రోజుల్లో ‘గెటవుట్‌’ను తెరకెక్కించాడు దర్శకుడు జోర్డాన్‌. అయితే విడుదలయ్యాక మాత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిందీ చిత్రం. సుమారు 255 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా టైమ్‌ మ్యాగజైన్‌, అమెరికన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ ఈ సినిమాను ఎంపిక చేశాయి. గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా లాంటి చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి నామినేషన్లు, ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆస్కార్‌ బరిలోనూ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే లాంటి ప్రధాన విభాగాల్లో పోటీపడుతోంది. ఓ హారర్‌ సినిమా ఈ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోవడం విశేషమే.
కథేంటి: నల్లజాతీయుడైన ఫొటోగ్రాఫర్‌ క్రిస్‌ వాషింగ్టన్‌(డేనియల్‌), శ్వేతజాతీయురాలైన తన ప్రియురాలు రోజ్‌(అలిసన్‌)తో కలసి ఓ మారుమూల ఉన్న వాళ్ల ఇంటికి వెళ్తాడు. నల్లజాతీయులను ద్వేషించే రోజ్‌ తల్లిదండ్రులు, సోదరుడు క్రిస్‌తో సరిగా మాట్లాడరు. ఇంట్లో పనిచేసే నల్లవారూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. క్రిస్‌ పొగతాగే అలవాటును హిప్నోథెరపీ ద్వారా పోగొడతానని చెప్పి రోజ్‌ తల్లి అతనిపై హిప్నాటిజం చేస్తుంది. దీంతో అతడు ఓ శూన్య ప్రపంచంలోకి జారిపోతాడు. అక్కడ అతనికి బాల్యంలో జరిగిన ఓ దుర్ఘటన కనిపిస్తుంది. పీడకల నుంచి తేరుకున్నట్లుగా మేల్కొన్న క్రిస్‌కు సిగరెట్లపై విరక్తి ఏర్పడుతుంది. కానీ ఇంట్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఆ ఇంటికి ఓ పార్టీకి వచ్చిన కొందరు శ్వేతజాతీయులు, క్రిస్‌ ఫొటోగ్రఫీ ప్రతిభ చూసి అబ్బురపడతారు. అంధుడైన జిమ్‌ హుడ్సన్‌, లోగన్‌ కింగ్‌ అనే నల్లజాతీయుడు కూడా పార్టీకి వచ్చిఉంటారు. లోగన్‌ను క్రిస్‌ ఫొటో తీస్తే పిచ్చివాడిలా కేకలు వేస్తూ గెటవుట్‌ అని అరుస్తాడు. ఇంట్లో వారి విచిత్ర ప్రవర్తన చూసి అనుమానంతో వారి ఫొటోలను తన స్నేహితుడికి పంపుతాడు క్రిస్‌. వాటిలో లోగన్‌ను చూసి అతడు కొన్నిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆండ్రె అని వ్యక్తి అని, అక్కడేదో ప్రమాదం పొంచి ఉందని చెబుతాడు స్నేహితుడు. దీంతో అక్కణ్నంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు క్రిస్‌. ఆ విషయం పసిగట్టిన రోజ్‌ కుటుంబ సభ్యులు గేట్లు మూసేస్తారు. రోజ్‌ తల్లి మళ్లీ అతణ్ని హిప్నటైజ్‌ చేసి ఇంటి బేస్‌మెంట్‌లో కుర్చీలో బంధిస్తుంది. అక్కడ అతనికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. రోజ్‌ కుటుంబం తెల్లజాతీయుల మెదళ్లను నల్లజాతీయుల శరీరాల్లోకి ప్రవేశపెడ్తుంటారని, ఇంట్లో ఉన్న పనిమనుషుల శరీరార్లో రోజ్‌ పూర్వీకుల ఆత్మలున్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్‌ శరీరంలోకి అంధుడైన జిమ్‌ మెదడును ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు. దాంతో తనకు చూపుతో పాటు క్రిస్‌లోని ఫొటోగ్రఫీ నైపుణ్యం లభిస్తాయని జిమ్‌ ఆశపడ్తుంటాడు. మరి ఆ ఇంటి నుంచి క్రిస్‌ బయటపడ్డాడా? ప్రాణాలు కాపాడుకున్నాడా? అన్నది ‘గెటవుట్‌’లో చూడాలి.
విశేషాలు :
ర్యాప్‌ సింగర్‌ చాన్స్‌కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఒకరోజు షికాగోలోని అన్ని థియేటర్లలోని అన్ని టికెట్లనూ అతనే కొని జనాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించాడు.
తొలి చిత్రంతోనే వంద మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించిన తొలి నల్లజాతీయుడైన దర్శకుడిగా జోర్డాన్‌ రికార్డు సాధించాడు.

గుడ్డు పెడుతున్న ఇండోనేసియా బాలుడు!

బాలీ: ఇదొక వింత. కోడి గుడ్డును మనిషి పెడుతున్నాడు. అదీ అందరూ చూస్తుండగానే. అసలు ఇది ఎలా జరుగుతోందో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ ఇండోనేసియాకు చెందిన 14ఏళ్ల అక్మల్‌లో దాగిన మర్మమిదీ..! ఇతడు రెండేళ్లలో 18 గుడ్లు పెట్టాడంటూ అంతర్జాలంలో వార్తలు హల్‌చల్‌చేశాయి. వీటిని అందరూ కొట్టిపారేశారు. అయితే గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. దీనిలో ఎలాంటి ఇంద్రజాలమూలేదని అక్మల్‌ తండ్రి రుస్లి చెబుతున్నారు. ‘ఇదివరకు అక్మల్‌ పెట్టిన ఓ గుడ్డును పగులగొట్టాను. లోపల అంతా పసుపుపచ్చ సొనే ఉంది. మరొక గుడ్డును అక్మల్‌ తల్లి పగులగొట్టింది. దానిలో పసుపుపచ్చ సొనే లేదు. అంతా తెల్లగా ఉంది. అసలు గుడ్డును అమాంతం ఎప్పుడూ అక్మల్‌ మింగలేదు’అని ఆయన వివరించారు. మరోవైపు అక్మల్‌ గుడ్డును వైద్యులు పరిశీలించారు. ఇవి కోడి గుడ్లలానే ఉన్నట్లు తేల్చారు. ఇవి అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనేది అంతుచిక్కడం లేదు. వీటిని కావాలనే మలద్వారం గుండా శరీరంలోకి పంపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్‌ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి’అని సంబంధిత అసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఇండోనేసియాలో మనిషి గుడ్డుపెట్టాడంటూ వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఉత్తర జకార్తాకు చెందిన కాకెక్‌ సినిన్‌ 2015లోనూ ఇదే విషయంతో వార్తల్లోకెక్కారు.

Tuesday, 20 February 2018

Anti-theft, Stylish, Lots of space, with a external USB charging port. Get your LUGG, the most innovative backpack for the Indian market


.Anti-theft, Stylish, Lots of space, with a external USB charging port. Get your LUGG, the most innovative backpack for the Indian market

MORE DETAILS SEE THE https://goo.gl/FRU3jM
కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు బ్యాక్‌పాక్‌ లేకుండా బయటికి పోలేని స్థితి. అయితే, ఇప్పటి వరకూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాగులన్నింటికీ ముందు భాగంలోనే పలు రకాల జేబులు ఉన్నాయి. దీంతో బ్యాగు తగిలించుకున్నాక వెనక పదే పదే చెక్‌ చేస్తుంటాం. జేబులకు ఉన్న జిప్‌లన్నీ సరిగా ఉన్నాయా... లేదా అని. జన సంద్రంలో దొంగల భయంతో కొన్ని సార్లు వీపునకు తగిలించుకోవాల్సిన బ్యాగుని ముందుకి తగిలించుకుంటాం కూడా. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వస్తువుల్ని భద్రంగా మోసుకెళ్లాలంటే? LUGGబ్యాగు ధరిస్తే సరి. వైవిధ్యమైన డిజైన్‌తో బ్యాగుని తీర్చిదిద్దారు. బ్యాగు ముందు భాగంలో ఒక్క జేబూ కనిపించదు. తగిలించుకున్న బ్యాగు జిప్‌ని ఓపెన్‌ చేయడం ఇతరులకు అసాధ్యం. సామర్థ్యం 20 లీటర్లు. 15 అంగుళాల పరిమాణం ఉన్న ల్యాపీని సులువుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక అర ఉంది. ట్యాబ్లెట్‌, ఐపాడ్‌, మొబైల్‌... లాంటి ఇతర యాక్ససరీస్‌ని పెట్టుకునేందుకు లోపల ప్రత్యేక అరలు ఉన్నాయి. వర్షంలో ‘రెయిన్‌ ప్రూఫ్‌’ కవచంతో బ్యాగుని తడవకుండా కాపాడుకోవచ్చు.LUGG Plusమోడల్‌తో నీళ్ల బాటిల్‌ని పెట్టుకునేందుకు వీలుగా ‘బాటిల్‌ హోల్డర్‌’ని అందిస్తున్నారు. ధర రూ.1,500. ఇతర వివరాలకుhttps://goo.gl/FRU3jM
పవర్‌ బ్యాంకుని బ్యాగులోపల ఏర్పాటు చేసిన యూస్‌బీ పోర్ట్‌కి అనుసంధానం చేసి ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. అందుకు అనువుగా బ్యాగుకి బయటి పక్క ఎక్స్‌టర్నల్‌ యూఎస్‌బీ పోర్ట్‌ని నిక్షిప్తం చేశారు.


చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు?

చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 

 భారత మణికట్టు మాంత్రికుడు చాహల్‌ ఈ మధ్య మైదానంలో కళ్ల జోడు పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పెట్టుకోని చాహల్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో మాత్రమే కళ్ల జోడు ధరిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? చాహల్‌కు ఏమైఉంటుంది? అన్న అనుమానాలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి. స్టైల్‌గా కనిపించేందుకు కళ్ల జోడు పెట్టుకుంటున్నాడంటూ పలువురు నెట్టింట్లో కామెంట్లు పెట్టారు.

ఐతే.. దీనిపై చాహల్‌ తండ్రి వివరణ ఇచ్చారు.  చాహల్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన వైద్యులను సంప్రదించాడు. వారు అప్పుడప్పుడు కళ్లజోడు ధరించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు చాహల్‌ కళ్లజోడు ధరిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సమయంలో కాకుండా ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు పెట్టుకుంటున్నాడు. త్వరలో చాహల్‌ ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు’ అని చాహల్‌ తండ్రి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన అనంతరం చాహల్‌ దిల్లీలో ఐటీ  ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఆయన చెప్పారు.
సఫారీ గడ్డపై భారత పర్యటన ఈ నెల 24తో ముగియనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది.

Monday, 19 February 2018

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

 మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసుకున్నారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నట్లు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాల పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌదరి తెలిపారు. త్వరలో అతిథులతో సింపుల్‌గా వలీమా డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీటీఐ సెంట్రల్‌  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్‌ సయీద్‌ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోను విడుదల చేసింది.
గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాను జనవరి ఒకటో తేదీన వివాహం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఖాన్‌ వీటిని ఖండించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు  వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ పుకార్ల ప్రభావం పార్టీపై పడుతోందని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తమ వివాహాన్ని అధికారికంగా తెలియజేయాలని ఇమ్రాన్‌కు పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన మనేకాను వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
 మనేకా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఖాన్‌ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్‌ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్‌ వెల్లడించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.

Sunday, 18 February 2018

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

మంచి వేతనం.. పని ఒత్తిడి తక్కువ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అదీ పదోతరగతి విద్యార్హతతో.. అలాంటి అవకాశాన్ని మన ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ద్వారా కల్పిస్తోంది.
ఏపీ పోస్టల్‌ సర్కిల్లో 245 పోస్టులు
- పోస్టుమెన్‌ 234  - మెయిల్‌ గార్డు 11
పదోతరగతి విద్యార్హతతోనే జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది తపాలా శాఖ. పోస్టు మెన్‌, మెయిల్‌ గార్డు అంటే ఇవేవో చిన్న ఉద్యోగాలే అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ రెండు ఉద్యోగాలకూ 21700 మూలవేతనం దక్కుతుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్‌ వచ్చినప్పటికీ పాతికవేల రూపాయల నెల జీతం గ్యారెంటీ. అంతేకాకుండా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు సైతం పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటినీ ప్రయత్నించవచ్చు.
పరీక్ష ఇలా...
వంద మార్కులకు ఆప్టిట్యూడ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు.  ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అవి...
పార్ట్‌ - ఎ: జనరల్‌ నాలెడ్జ్‌, పార్ట్‌ - బి: మ్యాథమేటిక్స్‌
పార్ట్‌ - సి:  ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. విభాగం 1లో ఇంగ్లిష్‌, 2లో తెలుగు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత సాధించాలంటే...
పార్ట్‌ ఎ, బిలు కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. అలాగే పార్ట్‌ సిలో రెండు విభాగాలూ కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. ఇలా విభాగాల వారీ మార్కులు సాధించడంతోపాటు మొత్తం ప్రశ్నపత్రం నుంచి ఓసీలు 40, ఓబీసీలు 37, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. అనంతరం అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఉద్యోగంలోకి చేరిన మొదటి నెల నుంచే రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సులూ కలుపుకుని ప్రారంభం నుంచే రూ.25 వేలకు తగ్గకుండా వేతనంగా పొందవచ్చు.
ఖాళీల వివరాలు: పోస్టుమ్యాన్‌ ఖాళీలు విజయవాడ రీజియన్లో 106, కర్నూలులో 60, విశాఖపట్నంలో 68 ఉన్నాయి. మెయిల్‌ గార్డు పోస్టులు విజయవాడ రీజియన్‌లో 6, కర్నూలులో 2, విశాఖపట్నంలో 3 ఉన్నాయి.
అర్హత:  పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు .
పరీక్ష కేంద్రాలు:  విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్‌ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ:  మార్చి 15 హెడ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20
వెబ్‌సైట్‌: www.appost.in, www.indiapost.in

చిత్తూరులో యెమెన్‌ విద్యార్థి ఆత్మహత్య



చిత్తూరులో యెమెన్‌ విద్యార్థి ఆత్మహత్య 


చిత్తూరు నగర శివారులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ఖలెద్‌ మహమద్‌ ఒత్‌మాన్‌ నయీఫ్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యెమెన్‌ దేశానికి చెందిన ఇతడు 2014లో ఆ దేశ ప్రభుత్వం తరఫున ఉపకార వేతనంపెకిక్కడికి వచ్చాడు. అదే దేశానికి చెందిన హషీమ్‌ అల్‌-షబి అనే విద్యార్థితో కలసి స్థానికంగా గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడు. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కేరళకు తీసుకెళ్లి అక్కడ వైద్య సేవలను అందించాడు. అతడి గదిలో ఉంటున్న మిత్రుడు సైతం కొన్ని నెలల నుంచి ఆరోగ్య సమస్యలపై కేరళలో వైద్య సేవలను పొందుతున్నాడు. ఇటీవలే మిత్రుడు కేరళకు వెళ్లగా.. తన తల్లికి సైతం అక్కడి నుంచి మందులు తీసుకురావాలని కోరాడు. శనివారం కేరళకు వెళ్లిన మిత్రుడు.. నయీఫ్‌కు ఫోన్‌ చేశాడు. ఎంతసేపటికీ అతడు స్పందించకపోవడంతో మరో మిత్రుడికి ఫోన్‌చేసి గదిని పరిశీలించాలని కోరాడు. మిత్రులు వెళ్లి గదిని పరిశీలించగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్యలు.. లేక ఆర్థిక సమస్యలేదైనా ఉండొచ్చని తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

ఇక మీదట సౌదీ భర్తల పనిలేదు..!

ఇక మీదట సౌదీలో  భర్తల అనుమతితో పనిలేదు..!

రియాద్‌: దశాబ్దాల కాలంగా మహిళలకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది.. పురుషులతో పాటు స్టేడియంకు వెళ్లి సాకర్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అక్కడ మహిళలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అందుకు భర్త లేదా తండ్రి లేదా సోదరుడు అనుమతిని తీసుకురావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిబంధనలు ఎత్తివేసింది.
మహిళలు ఇకమీదట పురుషుల అనుమతి లేకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రైవేటు రంగంలో మహిళలు రాణించడాన్ని ప్రోత్సహించేందుకు ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. సౌదీఅరేబియా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ విభాగం  తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్‌ను నియమించనుంది. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఖాళీగా ఉన్న 140 పోస్టుల్లో మహిళలను నియమించుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం 1,07,000 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

Saturday, 17 February 2018

లోకల్‌ శాస్త్రవేత్తలు

ఈ శాస్త్రవేత్తలు పక్కా లోకల్‌!
అనగనగా ఒక కాకి. దానికి దాహం వేసింది. వెదగ్గా వెదగ్గా ఓ కుండలో అడుగున కొద్దిగా నీరు కన్పించింది. కానీ అడుగున ఉన్న ఆ నీరు పైకి వచ్చేదెలా, తాగడమెలా? కాసేపు ఆలోచించిన కాకి దూరంగా ఉన్న గులక రాళ్లను ఒక్కోటిగా తెచ్చి కుండలో వేసింది. కాసేపటికి నీరు పైకి వచ్చింది. కాకి దాహం తీరింది. ఇది పాత కథ. అంత కష్టమెందుకు, సింపుల్‌గా స్ట్రా తెచ్చుకుని తాగెయ్యుచ్చుగా అంటుంది ఈ తరం. పాతదైనా కొత్తదైనా ఈ కథ... ఎందరో పల్లెటూరి శాస్త్రవేత్తలకు ప్రేరణ. అవసరం ఆలోచింపజేస్తుందనీ, ఆలోచన సరికొత్త ఆవిష్కరణకి దారిచూపుతుందనీ నిరూపిస్తున్నారు ఈ చదువులేని శాస్త్రవేత్తలు. 
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. పల్లె బిడ్డలు పట్టణానికి వెళ్లినా పల్లె కష్టాలని మరవరు. సమస్య ఉన్న చోటే పక్కాలోకల్‌ పరిష్కారమూ ఉంటుందని నమ్ముతారు. అందుకే చదివింది వానాకాలపు చదువులే అయినా, అందుబాటులో ఉన్న పరికరాలనే అవసరానికి తగ్గట్టు మలచుకుంటూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. కఠినమైన సమస్యలకీ కత్తిలాంటి సమాధానాలు కనిపెడుతున్నారు. ఏళ్ల తరబడి తాము కష్టపడినా తోటివారి అవసరాలు తీరుస్తున్నారు. అవార్డులూ అందుకుంటున్నారు.

అమ్మకోసం... ఆ రిమోట్‌!

బొమ్మగాని మల్లేశం పేదింటి బిడ్డ. పదో తరగతిలోనే పని బాట పట్టాడు. అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మకోసం అతడిలో మొదలైన ఆలోచన 15 కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసింది. 20 అవార్డులూ పలు పేటెంట్లూ పొంది, సొంత కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగేలా చేసింది. మల్లేశానికి సొంత పొలం లేదు. అయినా అతడి ఆవిష్కరణలన్నీ వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. పల్లెటూళ్లో రైతుల్నీ వారి కష్టాల్నీ చూస్తూ పెరిగాననీ దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాలు తీర్చాలన్న ఆశే వారికోసం కొత్త వస్తువులు తయారుచేయిస్తోందనీ అంటాడు మల్లేశం. 
తండ్రీకొడుకులు పొద్దున్నే పనులకు వెళ్తే మళ్లీ రాత్రికే ఇంటికి వచ్చేవారు. తాము వచ్చి లైటు వేసేదాకా మంచంమీద తల్లి చీకట్లో ఉండడం అతడిని బాధించింది. అప్పటికే విద్యుత్తు పరికరాల మరమ్మతు దుకాణంలో పనిచేస్తున్నాడు మల్లేశం. తాను నేర్చిన పరిజ్ఞానంతో ప్రయోగాలు చేసి ఫ్యాను, లైట్లకు రిమోట్‌ తయారుచేశాడు. దాన్ని తల్లి చేతికిచ్చి లైట్‌ వేయించినప్పుడు ఆమె మొహంలో కన్పించిన ఆనందం మర్చిపోలేనంటాడు మల్లేశం. అప్పుడతని వయసు పదిహేనేళ్లు. మల్లేశం తయారుచేసిన రిమోట్‌ చూసి చాలామంది అలాంటివి తయారుచేసివ్వమని అడిగారు. అప్పటినుంచి చుట్టుపక్కల వారి అవసరాలను నిశితంగా పరిశీలించడం అలవాటైంది అతనికి. రిమోట్‌లు తయారుచేస్తూ వచ్చే డబ్బుతో ప్రయోగాలను కొనసాగించాడు. డీజిల్‌ లేదా పెట్రోలుతో పనిచేసే స్ప్రేయర్లు వాడుతున్న రైతుల ఖర్చు తగ్గించడానికి సూర్యరశ్మితో పనిచేసే స్ప్రేయర్ని తయారుచేశాడు. కరెంటు లేనప్పుడు ఇన్వర్టరుగానూ పనిచేస్తుందిది. కలుపు తీయడానికీ, విత్తనాలు నాటడానికీ, నీటి మోటార్లను మొబైల్‌తో నియంత్రించడానికీ... ఇలా పలు పరికరాలు తయారుచేశాడు. వస్తువు ప్రయోజనం ఏమిటో దాని పనితీరు ఎలా ఉండాలో తెలిస్తే దానికి రూపకల్పన చేయడం కష్టం కాదంటాడతను. మల్లేశం తయారుచేసిన ఓ పరికరం బిగిస్తే డ్రైవరు తాగి వస్తే ఆ వాహనం స్టార్ట్‌ అవదు. ఇలాంటి కొన్ని వస్తువులకు పేటెంట్లు రావాల్సి ఉంది. అవార్డుల ద్వారా వచ్చిన డబ్బుతోనూ, పల్లెసృజన లాంటి సంస్థల ప్రోత్సాహంతోనూ మల్లేశం తన ఆవిష్కరణల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.

          నాటి రిక్షావాలా... నేటి మార్గదర్శి
పాతికేళ్ల వయసులో దిల్లీలో రిక్షా తొక్కుతున్నప్పుడు లీలామాత్రంగానైనా ఊహించలేదు అతడు తానో రైతునీ, ఆవిష్కర్తనీ అవుతానని. దశాబ్దం తిరిగేసరికల్లా ధరమ్‌వీర్‌ అలా ఎలా అయ్యాడంటే... ఉన్నది రెండెకరాల పొలం. తల్లి మరణంతో చదువు అటకెక్కింది. కొంతకాలం తండ్రికి సాయంగా ఉన్న ధరమ్‌వీర్‌ భార్యాబిడ్డల్ని హరియాణాలోని ఊళ్లోనే వదిలి దిల్లీ బయల్దేరాడు. రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని చదివించాలనుకున్నాడు. రెండేళ్లు కష్టపడ్డాడు. ఔషధ మొక్కల ఉత్పత్తులకి అక్కడి మార్కెట్లో లభిస్తున్న ప్రాధాన్యం అతడిని ఆశ్చర్యపరిచింది. ఆ మొక్కలు తమ ఊళ్లో విచ్చలవిడిగా పెరగడం అతనికి తెలుసు. ఇంతలో రోడ్డుప్రమాదం. ఏడాది పాటు మనిషి మంచం మీదే. మనసు మాత్రం గతాన్నీ వర్తమానాన్నీ పెనవేస్తూ పెద్ద ఆలోచనలే చేసింది. కోలుకోగానే ఉన్న ఆ కొంచెం పొలంలోనే కలబంద, ఉసిరి, పుట్టగొడుగులు పండించాడు. ఇక ఇప్పుడు వాటితో రకరకాల ఉత్పత్తులు తయారుచేయాలి. కలబంద రసం తీసే మిషన్‌ కొందామని వెళ్తే కమిషన్‌ 5 లక్షలు అడిగారొకరు. దాంతో ఆ యంత్రాన్ని తానే తయారుచేయాలనుకున్నాడు ధరమ్‌వీర్‌. కొన్ని పరిశ్రమలను చూసివచ్చాడు. ఆ అవగాహనకి తన తెలివితేటలు జోడించి రెండేళ్లు కష్టపడి నమూనా యంత్రాన్ని తయారుచేశాడు. దానిమీద ప్రయోగాలు చేస్తూ మరింతగా అభివృద్ధి చేసి మొత్తానికి మల్ట్టీపర్పస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మెషీన్‌ని తయారుచేసేశాడు. ఉష్ణోగ్రతల్ని వేర్వేరు స్థాయుల్లో నియంత్రించడం ద్వారా ఆ మెషీన్‌తో ఔషధ మొక్కల ఆకుల నుంచి రసం, జెల్‌, పొడి... ఇలా ఏది కావాలంటే అది తయారుచేయొచ్చు. అప్పటివరకూ ఉన్నవాటికన్నా మెరుగైన యంత్రాన్ని తయారుచేసినందుకు అతడికి జాతీయ అవార్డు లభించింది. దానికి పేటెంటు తీసుకుని వ్యాపారవేత్తగా మారినా ధరమ్‌వీర్‌ తన రెండెకరాల పొలంలో పంటలు పండించడం మాత్రం మానలేదు. ప్రయోగాలు చేస్తున్న అతడిని ఒకప్పుడు పిచ్చివాడని వెక్కిరించిన గ్రామస్థులకు ఇప్పుడు అతడే మార్గదర్శి.

చింతచెట్టు ఎంత పని చేసింది!
కర్ణాటకలోని ధార్‌వాడ్‌లో ఓ పల్లె అతనిది. పేరుకి అరవై ఎకరాల మెట్ట. తండ్రి ఇచ్చిన డబ్బుతో ఉత్సాహంగా డజను బోర్లు వేయించాడు ఖాదర్‌. ఒక్క దాంట్లోనే నీళ్లు పడ్డాయి. పెట్టిన ఖర్చంతా వృథా. అప్పుడు ఆలోచన మొదలైంది. తర్వాత ఏడాది పొలంలోనే చిన్న చిన్న కుంటలు తవ్వి వాన నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. మామిడీ, జామా, సపోటా, చింత లాంటి పండ్లమొక్కలు నాటాడు. మరుసటి ఏడాదీ వానల్లేక విపరీతమైన కరువు. చివరికి ఒక్క చింత తప్ప మరే చెట్లూ పెరగలేదు. ఎక్కడెక్కడినుంచో నీరు తెచ్చి కష్టపడి వాటినైనా కాపాడుకోగలిగాడు. ఆ కరవు సమయంలో చింత పండించడమే గొప్పని ఊరంతా అతడిని ప్రశంసించింది. చెట్లనిండా కాసిన చింతకాయలు అతడిలోని ఆవిష్కర్తను తట్టిలేపాయి. చిన్నప్పుడు అలారం మోగినా నిద్ర లేవడంలేదని తండ్రి తిడుతోంటే ఖాదర్‌ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. అలారం మోగినపుడు సీసా వంగి నీరు అతని ముఖంపై పడేలా గడియారానికి నీటిసీసాని అనుసంధానించాడు. అది చూసి తండ్రి నవ్వుకున్నాడే కానీ కొడుకుని చదివిస్తే గొప్ప శాస్త్రవేత్త కాగలడేమోనన్న ఆలోచన రాలేదు. ఆ సంఘటన గుర్తొచ్చిన ఖాదర్‌ మళ్లీ బుర్రకి పనిచెప్పాడు. చింతకాయలన్నీ అప్పటికప్పుడు అమ్మేస్తే గిట్టుబాటు కాదు. అందుకని రంగూ, నాణ్యతా దెబ్బతినకుండా వాటిని నిల్వ చేయడానికి ఇంట్లోనే నేలమాళిగ కట్టించాడు. భార్యాబిడ్డల చేత చింతపండు గుజ్జూ పచ్చళ్ల లాంటివి తయారుచేయించాడు. ఈ క్రమంలో పండు నుంచి గింజ తీయడానికి చాలా సమయం పట్టడం గమనించిన ఖాదర్‌ చింతకాయల నుంచి గింజలు వేరుచేసే యంత్రాన్ని తయారుచేశాడు. కాయలు అందులో వేస్తే చింతపండూ గింజలూ విడివిడిగా వచ్చేస్తాయి. 500 మంది చేసే పనిని ఆ మెషీన్‌ ఒక్కరోజులో చేయగలదు. పచ్చళ్లకోసం పచ్చి చింతకాయల్ని ముక్కలుగా కోయడం మరో పెద్ద పని. దానికోసమూ, చెట్టునుంచిచింతకాయలు కోయడానికీ కూడా ప్రత్యేక యంత్రాలను తయారుచేశాడు. వీటివల్ల ఎంతో సమయంతో పాటు కూలీల ఖర్చూ కలిసొచ్చేది. ఖాదర్‌ ఆవిష్కరణల్ని చూసిన తోటి రైతులు తమ అవసరాలనూ అతని దగ్గర చెప్పుకునేవారు. దాంతో ఎన్నిసార్లు దున్నినా పదును తగ్గని నాగలి కర్రునీ, అన్ని రకాల విత్తనాలనూ నాటేందుకు పనికొచ్చే సీడర్‌నీ... ఇలా రకరకాల యంత్రాలను తయారుచేశాడు. వాటన్నిటికీ పేటెంట్లు తీసుకున్నాడు. ఆయా వస్తువులకు ఉన్న గిరాకీని చూసి పెద్దఎత్తున తయారుచేసి అమ్మేందుకు కంపెనీ పెట్టాడు ఖాదర్‌. సమాజానికి పనికివచ్చే యంత్రాలను వరసగా ఆవిష్కరిస్తూ వచ్చిన అబ్దుల్‌ఖాదర్‌ నదకట్టిన్‌ను నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ తరఫున జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.
ఆ ఒక్క సంఘటన...

ఆర్థిక పరిస్థితులు అనుకూలించక బడి మానేసి ఇంట్లో ఉంది షాజియా జాన్‌. తల్లి పనిమీద ఎక్కడికో వెళ్లింది. అప్పుడు అతిథులు వచ్చారు. షాజియాకు సమోవర్‌లో టీ తయారుచేయడం రాదు. దాంతో వారికి టీ చేసి ఇవ్వలేకపోయింది. ఇంట్లో పెద్దవాళ్లు లేనప్పుడు తాను బాధ్యతగా వ్యవహరించలేకపోయానన్న ఆలోచన ఆమెలో ఆవిష్కర్తను నిద్ర లేపింది. ఫలితంగా సమోవర్‌ని బొగ్గులతో కాక గ్యాస్‌తో పనిచేసేలా తయారుచేసి నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డుని అందుకుంది షాజియా. 
టీ తయారుచేసుకోవడం మనకు నిమిషాల్లో పని. కానీ కశ్మీరీలకు చాలా పెద్ద పని. సమోవర్‌ అనే ప్రత్యేక పాత్రలో బొగ్గుల మీద కాయాలి. అందుకు ఎప్పుడూ బొగ్గులు సిద్ధంగా ఉండాలి. ఆ పాత్రలోనే టీ చేయడం వారి సంస్కృతిలో విడదీయరాని భాగం. ఎవరింటికన్నా వెళ్లినప్పుడు టీ ఇవ్వలేదంటే అది అతిథులను అవమానపరిచినట్లే. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారు సాధ్యమైనంతవరకూ. షాజియా తండ్రికి విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతు చేసే దుకాణం ఉంది. ఇంట్లో అమ్మకు సాయం చేయడం, తండ్రి బయటకు వెళ్లినప్పుడు దుకాణంలో కూర్చోడం షాజియా పని. అక్కడ ఖాళీగా కూర్చోక చిన్న చిన్న మరమ్మతు పనులూ చేసేది. అలాంటప్పుడే పై సంఘటన జరిగింది. బొగ్గుల పని లేకుండా సమోవర్‌కి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ముందు ఇంట్లో ఉన్న సమోవర్‌ భాగాలన్నీ విడదీసి చూసింది. బర్నర్‌ ఎక్కడ పెట్టాలో, గ్యాస్‌ కనెక్షన్‌ ఎలా ఇస్తే బాగుంటుందో ఆలోచించింది. ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగానే తండ్రికి వివరించింది. అతనికీ ఆలోచన నచ్చింది. సమోవర్‌కి సరిపోయేలా బర్నర్‌, రెగ్యులేటర్లను గ్యాస్‌స్టౌ మెకానిక్‌తో ప్రత్యేకంగా తయారుచేయించారు. 


గ్యాస్‌ సమోవర్‌ తయారైంది. చక్కగా పనిచేస్తోంది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కశ్మీరీల ప్రత్యేకతైన నమ్‌కీన్‌ చాయ్‌తో సహా అన్ని రకాల చాయ్‌లనూ తయారుచేసుకోవచ్చు. పావుగంటలో పాతిక మందికి సరిపడా టీ సిద్ధం చేయొచ్చు. అదే బొగ్గుల సమోవర్‌ అయితే ముప్పావుగంట పట్టేది. మెకానిక్‌ ద్వారా విషయం బయటకు తెలిసిపోయింది. చలికాలంలో సమోవర్‌కోసం బొగ్గుల్ని బంగారంలా దాచుకునే పని తప్పిందంటూ ఆ అమ్మాయి ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. రెండు పదుల వయసులోనే నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డు గెలుచుకున్న ఆ యువతి ఎప్పటికైనా చదువు కొనసాగించాలనీ, గ్యాస్‌ సమోవర్లు తయారు చేసే పరిశ్రమ పెట్టాలనీ కలలు కంటోంది.

ఏ చెట్టయినా ఎక్కేయొచ్చు!
సాటివారి కష్టం విని స్పందించే గుణం ఓ రోజుకూలీని వ్యాపారవేత్తను చేసింది. కోయంబత్తూరుకు చెందినడి.రంగనాథన్‌(డిఎన్‌.వెంకట్‌) పెద్దగా చదువుకోలేదు. ఓ స్పిన్నింగ్‌ మిల్లులో రోజుకూలీగా పనిచేశాడు. కొన్నేళ్లకు మిల్లు మూతపడడంతో చేసేదేమీ లేక వ్యవసాయపనులు చేసుకుంటూ పల్లెలోనే స్థిరపడ్డాడు. రైతుల పనిముట్లకు రిపేర్లూ చేసిపెట్టేవాడు. అలా వారితో మాట్లాడేటప్పుడు చెట్లెక్కేవారు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులు అతని దృష్టికి వచ్చాయి. తేలిగ్గా చెట్లెక్కడానికి తోడ్పడే సురక్షితమైన పరికరం ఒకటి స్వయంగా తయారుచేయాలని పని ప్రారంభించాడు. 

కొబ్బరి చెట్లూ తాటిచెట్లూ ఎక్కి కాయలను కోసేటప్పుడు జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. దాంతో క్రమంగా అసలా చెట్లెక్కే వృత్తిలోకే ఎవరూ వెళ్లడంలేదు. ఈ పరిస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వరం మల్టీ ట్రీ క్లైంబర్‌. చక్కగా కుర్చీలో కూర్చున్నట్లు సౌకర్యంగా కూర్చుని ఎంత ఎత్తైన చెట్టయినా అలవోకగా ఎక్కేయొచ్చు ఈ పరికరంతో. సాంకేతికంగానూ భద్రతాపరంగానూ ఉన్నత ప్రమాణాలతో తయారైన ఆ పరికరాన్ని తయారుచేసింది మెకానికల్‌ ఇంజినీర్లు కాదు, మెకానిక్‌ వెంకట్‌. అతడి పదేళ్ల కృషి ఫలితం ఆ పరికరం. అది తాటి, కొబ్బరి ఇలా ఏ రకం చెట్టుకైనా, కాండం వెడల్పు ఎంతున్నా అమరుతుంది. చేతులూ కాళ్లతో పైపైకి అమర్చుకుంటూ ఎలాంటి భయం లేకుండా 40 అడుగుల చెట్టుని ఐదు నిమిషాల్లో ఎక్కేయొచ్చు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా దానిని పరిశీలించి సురక్షితమైనదన్న సర్టిఫికెట్‌ ఇచ్చారు. నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డూ లభించింది. వెంకట్‌కి ముందూ తర్వాతా కూడా కొందరు రకరకాల ట్రీ క్లైంబర్లను తయారుచేశారు కానీ అవి ఒక రకం చెట్లకే పనికొస్తాయి. వేర్వేరు చెట్లకి వేర్వేరు పరికరాలు కొనుక్కోవాలి. వెంకట్‌ పరికరం ఏ రకం చెట్టుకైనా పనికొస్తుంది. ‘ఆర్‌ టెక్‌ ఇంజినీరింగ్‌’ పేరుతో ఇప్పుడు వెంకట్‌ ఈ మల్టీ ట్రీ క్లైంబర్ల వ్యాపారం చేస్తున్నాడు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు.

ముగ్గురు ఇంజినీర్లు వంగివున్న ఓ పైపులోకి ఒక వైరుని దూర్చుతున్నారు. ఎంత 
ప్రయత్నించినా అది వంపు దగ్గర ఆగిపోతోంది కానీ ఆ చివరికి వెళ్లడం లేదు. 
ఇదంతా ఒక రైతు చూసి ‘‘సార్‌, నేను ప్రయత్నించనా?’’ అని అడిగాడు. 
‘ఇంత చదువూ తెలివీ ఉన్న మనం మూడు రోజులుగా కష్టపడుతున్నా కానిది చదువూ సంధ్యాలేని ఈ పల్లెటూరి రైతువల్ల అవుతుందా, అమాయకుడు’ అని నవ్వుకుంటూ ‘‘సరే 
ప్రయత్నించు’’ అన్నారు ఆ ఇంజినీర్లు. 
రైతు తన పొలంలోకి వెళ్ళి ఒక ఎలుకను తీసుకునివచ్చి దాని తోకకి వైరును కట్టి పైపులోకి వదిలాడు. ఆ ఎలుక రెండోవైపు నుంచి బయటకు వచ్చింది, దాంతో పాటే వైరూనూ!! 
నోరు తెరిచారా ఇంజినీర్లు. 
అర్థమైందిగా... అదండీ సంగతి..!


పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

 రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఇంటి ఎదుట ఉంచిన రెండు కార్లు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.